తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగింది. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ తీసుకుంటోందనే ఆరోపణలు చేయడంతో దుమారం రేగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరూపణకు సవాలు విసిరారు. నిరూపించని పక్షంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డులు నుండి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.