తెలంగాణలో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మధ్య, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు.