తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరును ఓటరు జాబితా నుండి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన భారత పౌరుడు కాదంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటమే దీనికి కారణం. హైకోర్టు తీర్పుతో రమేష్కు పౌరసత్వం లేదని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై చెన్నమనేని రమేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.