తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ప్రణాళికలు ప్రకటించారు. రవాణా శాఖ కార్యాలయాల నుండి మధ్యవర్తులను తొలగిస్తామని, కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచుతామని తెలిపారు. విద్యుత్ వాహనాలపై రూ. 577 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ఆ వాహనాల విక్రయాలు 1.30 శాతానికి పెరిగాయని చెప్పారు. ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యం తగ్గాలంటే ప్రజలు సహకరించాలని, షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.