New Ration Cards for Eligible Beneficiaries: పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు అందిస్తామని, ఎవరూ నిరుత్సాహ పడవద్దని భరోసా ఇచ్చారు.