మంచిర్యాల జిల్లా, ముల్కలలో గోదావరి నది ఒడ్డున సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడడం సంచలనం సృష్టించింది. ఇటీవల అయోధ్య రామమందిరం పూజారి సూచన మేరకు, ఈ ప్రదేశంలో తవ్వకాలు జరపగా ఈ విగ్రహం లభించింది. విగ్రహం లభ్యం కావడంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు రంగంలోకి దిగి జనసందోహాన్ని నియంత్రించారు. ఈ ప్రాంతంలో దేవాలయం ఉందన్న స్వామీజీల సూచనతో, గ్రామస్తులు మరిన్ని తవ్వకాలు జరుపుతున్నారు.