నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. వీరు కోరుతున్న విధంగా ఆర్జిత సెలవుల నగదు మార్పిడి (Earned Leaves Encashment) సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నం. 230 జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది. ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న రెగ్యులర్ సిబ్బందికి ఇకపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ సెలవులను సరెండర్ చేసి నగదు పొందే వీలుంటుంది.