తెలంగాణ రెవెన్యూ శాఖ కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చింది. ప్రభుత్వ భూములు, పట్టా పాస్బుక్ లేని వ్యవసాయ భూములు, నాలా భూములతో పాటు వివాదాస్పద ప్రైవేట్ భూములు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చర్యతో భూ వివాదాలు తగ్గి, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు.