తెలంగాణ ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచే సాయంత్రం స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. దసరా సెలవుల తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయింపుతో పోషక విలువలున్న చిరుతిళ్లను అందించాలని యోచిస్తున్నారు.