తెలంగాణలో కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తీవ్రంగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందారు. జీవనశైలి మార్పులు, కాలుష్యం, అవగాహన లోపం ఈ వ్యాధుల పెరుగుదలకు కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు, క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.