తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.66.66 కోట్లతో ఒక భారీ పథకాన్ని ప్రారంభించాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిధులతో బ్రీడర్ విత్తనాభివృద్ధి, సీడ్ హబ్ల ఏర్పాటు, నూనె తీసే యంత్రాల సరఫరా వంటి చర్యలు చేపడతారు. ముఖ్యంగా.. వేరుశనగ సాగు చేసే 8 జిల్లాల్లోని రైతులకు 100 శాతం సబ్సిడీపై అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పంపిణీ చేయనున్నారు. .