తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. తదుపరి చర్యలపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఈసీ.. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.