బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణాలకు చెక్ పెట్టేందుకు టీజీఎస్ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో హైడ్రాలిక్ ఆటోమేటిక్ డోర్లు తెచ్చింది. బస్సు ఆగితేనే డోర్లు తెరుచుకుంటాయి, కదులుతుంటే ఆటోమేటిక్గా మూసుకుంటాయి. ముఖ్యంగా విద్యార్థుల భద్రత కోసం ఈ వినూత్న మార్పులు చేశారు. ఈ కొత్త బస్సులు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.