తెలంగాణ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రతిపాదికన కాకుండా సొంతంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గనుంది. బస్సుల్లో సీట్లు దొరకవనే టెన్షన్ లేకుండా హాయిగా ప్రయాణించే అవకాశం ఉంది.