హైదరాబాద్ నగర ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద విద్యుత్ బస్సుల సేకరణలో భాగంగా, హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనుంది. ఈ కొత్త బస్సులు రద్దీ సమస్యను తగ్గించి, పర్యావరణహిత ప్రజా రవాణాను బలోపేతం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.