తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. తిరుమలలో వయో వృద్ధుల దర్శనం, అలాగే అలిపిరి మెట్ల మార్గం వద్ద మందు బాబులు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించింది. తిరుమల శ్రీవారి భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది.