తిరుమలలో చిరుత సంచారం వార్తలు శ్రీవారి భక్తులను కలవరపెడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కనిపించడం, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కనిపించిందన్న వార్తలు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో చిరుత, వన్యప్రాణుల సంచారంపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి మెట్ల మార్గంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.