TTD Distribution Of SSD Tokens Commenced: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లలో SSD టోకెన్ల జారీని టీటీడీ ఇవాళ పునఃప్రారంభించింది. భక్తులు ఈ టోకెన్లను తీసుకోవచ్చని తెలిపారు. అయితే గత 9 రోజుల్లో 7 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు వచ్చింది.