తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. జులై నెలలో తిరుమలలో రెండుసార్లు టీటీడీ గరుడ వాహన సేవ నిర్వహిస్తోంది. గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాలు ఒకే నెలలో రావటంతో.. జులై నెలలో రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. జులై 10, జులై 20వ తేదీలలో గరుడ సేవ జరగనుంది. ఆయా రోజులలో సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.