టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. గత నెలలో మాంచి ధర పలికిన టమాటా ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కిలో రూపాయి కూడా పలకకపోవటంతో కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాణ్యత పేరు చెప్పి తక్కువ ధరకు అడుగుతున్నారని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ టమాటా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.