ట్రాఫిక్ చలాన్లపై ఇకపై డిస్కౌంట్లు ఉండవని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా బ్యాంకు ఖాతా నుంచే జరిమానా కట్ అయ్యేలా టెక్నాలజీ ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చెప్పారు. బ్యాంకు ఖాతాల అనుసంధానం వల్ల ప్రజల ఆర్థిక గోప్యతకు భంగం కలుగుతుందన్నారు.