సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 15,641 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ద్వారా సుమారు రూ. 72 లక్షలకు పైగా జరిమానాలను వసూలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ.. భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు. రోడ్లపై భద్రత పెంచేందుకు ఈ చర్యలు అవసరమన్నారు.