సామర్లకోట రైల్వే ఇంజనీరింగ్ సెక్షన్ పరిధిలో సిగ్నలింగ్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా రేపు పలు రైళ్లు రద్దు కానున్నాయి. ఉదయ్ ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్తో పాటు మరో నాలుగు రైళ్లు కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.