టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన విద్యా రవిచంద్రన్ అనే భక్తురాలు టీటీడీకి రూ.54 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.54 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. మరోవైపు ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి టీటీడీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది.