తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విరాళాలు వస్తు్న్నాయి. గత ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ మాసం వరకూ 950 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. అలాగే కోయంబత్తూరులో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఓ భక్తుడు 300 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. తిరుమల శ్రీవారికి 120 కేజీల బంగారం ఇచ్చేందుకు మరో భక్తుడు ముందుకు వచ్చినట్లు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా టీటీడీ ఈవో ఈ వివరాలను వెల్లడించారు.