ఐరెన్ అనే భక్తుడు శ్రీవెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టుకు రూ.10,11,111లు విరాళంగా అందించారు. అలాగే నెల్లూరుకు చెందిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత టీటీడీకి కెమెరా విరాళంగా అందించారు. రూ.8.84 లక్షలు విలువైన కెనాన్ డిజిటల్ మిర్రర్ లెస్ కెమెరా, లెన్సులను టీటీడీకి విరాళంగా సమర్పించుకున్నారు. దాత తరుఫున భానుప్రకాష్ రెడ్డి ఈ విరాళం అందించారు.