తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించే లక్ష్యంతో ఇకపై రాత్రి పూట భోజనంలోనూ వడలు వడ్డించాలని నిర్ణయించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయి.