తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకూ పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశమైంది. ఈ భేటీలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.