Vallabhaneni vamsi: టీడీపీ ప్రభుత్వ పతనానికి వంశీ మరణమే కారణమవుతుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

1 year ago 35
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీమోహన్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వంశీని ప్రభుత్వం వేధిస్తోందన్న పేర్ని నాని.. ఎన్టీఆర్ పతనానికి వంగవీటి రంగా మరణం కారణమైన తరహాలోనే వంశీకి ఏమైనా జరిగితే వంశీ మరణమే టీడీపీ ప్రభుత్వాన్ని బలి తీసుకుంటుందంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article