Varahi Sabha: ముస్లింలను చూసి నేర్చుకోండి.. తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 21
Varahi Sabha: దేశంలో సనాతన ధర్మం పట్ల, హిందూ మతం పట్ల జరుగుతున్న దాడిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సనాతన ధర్మం గురించి మాట్లాడితే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పారు. దేశంలోని లౌకికవాదులు గానీ, న్యాయస్థానాలు గానీ.. ఇతర మతాల పట్ల స్పందించినంత.. సనాతన ధర్మంపై దాడి జరిగినపుడు మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం అంతం చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Entire Article