ఏపీని మొంథా తుపాను భయపెడుతోంది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. ఇక మంగళవారం రోజున మొంథా తుపాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. విజయవాడలో మంగళవారం 16 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది.