హత్య కేసులో విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుగురిని హత్య చేసిన అప్పలరాజు అనే వ్యక్తికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న ఈ హత్యలు జరిగాయి. సుమారుగా నాలుగేళ్ల తర్వాత అప్పలరాజుకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అప్పలరాజు దారుణంగా హత్య చేశాడు. కత్తితో ఓ చిన్నారి సహా ఆరుగురిని దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో విచారణ జరిపిన విశాఖ న్యాయస్థానం.. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది.