విశాఖపట్నంలో మరో ప్రమాదం జరిగింది. కంటైనర్ టెర్మినల్లో పొగలు వచ్చిన సంగతి మరువకముందే.. సముద్రంలో ఉన్న బోటులో మంటలు చెలరేగాయి. చేపలవేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు ఓ బోటులో వెళ్లగా.. తీరానికి 35 మైళ్లు చేరగానే.. ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బోటు మొత్తం విస్తరించి మంటల్లో బోటు పూర్తిగా కాలిపోయింది. అయితే సముద్రంలోకి దూకేసిన మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. కోస్ట్ గార్డు సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.