ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను విపత్తుల నిర్వహణ సంస్థ వినిపించింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారనుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో ఏపీలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.