Andhra Pradesh Rain alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారిందని.. మరికొన్ని గంటల్లో వాయుగుండం బలహీనపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.