YS Jagan Chittoor Tour: వైసీపీ శ్రేణులకు ఎస్పీ వార్నింగ్

1 year ago 28
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించునున్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన సందర్భంగా హెలిపాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. అలాగే మామిడికాయల మార్కెట్ యార్డులో 500 మంది మామిడి రైతులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రదేశాలలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకని, నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.
Read Entire Article