అరటి రైతుల సమస్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. ఇటీవల పులివెందుల నియోజకవర్లంలో అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్.. రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతున్నాయని.. ఇదీ అరటి రైతుల దుస్థితి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అరటి మాత్రమే కాదని ఏపీలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు.