YS Sharmila on AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి కోతలు పెట్టిందని, రైతులకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల హామీల అమలులోనూ మోసం జరిగిందని విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, విభజన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన షర్మిల... టీడీపీ, వైసీపీ రెండు పార్టీల మీద విమర్శలు గుప్పించారు.