ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. మహాశక్తి పథకం ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి నెలా 1500 ఇస్తామన్నారన్న వైఎస్ షర్మిల.. రెండేళ్లు గడిచిపోయాయి ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ ఇదేనన్న షర్మిల.. అలాంటి హామీని అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం ప్రజలను ఘరానా మోసం చేస్తోందని విమర్శించారు.