YS Sharmila on Andhra Pradesh Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ విషయం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎష్ షర్మిల విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పిన కూటమి పార్టీలు.. ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల చెవులలో పూలు పెడితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్యాలీఫ్లవర్లు పెడుతోందంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు.