ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. జనం ఓట్లేసింది.. ఇంట్లో కూర్చుని మైకుల ముందు మాట్లాడటానికి కాదన్న షర్మిల.. సభలో ప్రజాసమస్యలను లేవనెత్తడానికి అని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం వైసీపీ మూర్ఖత్వమన్న షర్మిల.. అసెంబ్లీకి హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఆ దమ్మూ, ధైర్యం లేకుంటే వైసీపీ శాససనభాపక్షం మొత్తం రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ ఎద్దేవా చేశారు.