టీటీడీకి మరో భారీ విరాళం అందింది. ముంబైకు చెందిన భక్తులు టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. ముంబైకి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు, స్విమ్స్ ఆస్పత్రికి రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. టీటీడీ ఈవో రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఈవో అభినందించారు.