ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. ఐసీయూ సేవలు, ఎమర్జెన్సీ సేవలు, ఆపరేషన్ థియేటర్లలో సేవలను బహిష్కరించారు. దీంతో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా.. ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది.