మౌలాలి రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. వందేభారత్ రైలు ఢీకొట్టడంతో 20 ఏళ్ల నర్సు ప్రాణాలు కోల్పోయింది. స్టేషన్లో రైలు దిగిన తర్వాత నుంచి ప్లాట్ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతుండగా వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ యువ నర్సు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తెను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.