మాజీ మంత్రి మల్లారెడ్డి తన విద్యా సంస్థలను ఏపీలోనూ విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో సోమవారం మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మల్లారెడ్డి వెల్లడించారు. తిరుపతిలో యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి కుటుంబం దర్శించుకుంది. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మల్లారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.