సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును ప్రస్తావిస్తూ వచ్చిన కథనంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజల ఆస్తులను కాపాడటమే తన లక్ష్యమని, గద్దలను సింగరేణి దరిదాపుల్లోకి రానివ్వనని ఆయన హెచ్చరించారు. మీడియా సంస్థల అంతర్గత పోటీలో తనను లాగవద్దని ఆయన కోరారు.