YSRCP APP: కొత్త యాప్ తేనున్న వైఎస్ జగన్.. వారందరికీ సినిమా ఖాయమని వార్నింగ్

1 year ago 21
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ముఖ్యనేతలతో జగన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అధికారుల నుంచి ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు రాబోయే పది రోజుల్లో ఒక కొత్త యాప్ తీసుకొస్తున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. అందులో వివరాలు నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవర్నీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయాలని.. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని వివరాలు ఉంచాలన్నారు. ఆధారాలన్నీ కూడా అప్‌లోడ్‌ చేయాలని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తామని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article