ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తికానుంది. జూన్ 12వ తేదీతో ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది.