Ysrcp Mla Regam Matyalingam: వైఎస్సార్సీపీ వరుస ఓటములను ఎదుర్కొంటున్న వేళ, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, రాజకీయాల నుంచి తప్పుకుంటానే కానీ వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్తోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఎమ్మెల్యే మత్స్యలింగం తేల్చి చెప్పారు.