నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి సన్నిహితుడు.. వైసీపీకి గుడ్ బై చెప్పారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జిగా వ్యవహరించి పీవీ ప్రదీప్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్.. సమక్షంలో శుక్రవారం ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఈ పరిణామం నంద్యాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.